PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎంపీ హెచ్​ఈఓలుగా పదోన్నతి కల్పించాలి

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: రాయలసీమ రీజన్​ పరిధిలో ఫోర్త్​ జోన్​ కింద 30 ఎంపీహెచ్​ఈఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, కానీ ఆరుగురి మెయిల్​ సూపర్​వైజర్స్​ మాత్రమే కడప రీజనల్​ డైరెక్టర్​వారు కౌన్సిలింగ్​ నిర్వహిస్తున్నారని, మిగిలిన పోస్టులు కూడా భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని వైఎస్సార్​ మెడికల్​ అండ్​ హెల్త్​ ఎంప్లాయిస్​ ట్రేడ్​ యూనియన్​ జిల్లా అధ్యక్షులు కరుణానిధి కోరారు.24 పోస్టులకు సంబంధించి సీనియార్టి జాబితాలో ఉన్న మెయిల్​ సూపర్​వైజర్లతో ఎటువంటి అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా కౌన్సిలింగ్​ నిర్వహించాలని కడప రీజనల్​ డైరెక్టర్​ దృష్టికి తీసుకెళ్లాలని డీఎంహెచ్​ఓ గిడ్డయ్యను ఆయన కోరారు. కార్యక్రమంలో యూనియన్​ కార్యదర్శి హుసేను తదితరులు పాల్గొన్నారు.

About Author