PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘రైల్వే కోచ్​, నాగలదిన్నె బ్రిడ్జి’పై గద్వాల కలెక్టర్​ను కలిసిన ఎంపీ

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: కర్నూలు జిల్లా పంచలింగాలలో ఉన్న రైల్వే కోచ్​ రిహాబిలిటేషన్​ వర్క్​ పనులు త్వరగా పూర్తి చేసేందుకు సహకరించాలని గద్వాల కలెక్టర్​ వల్లూరు క్రాంతిని కోరారు కర్నూలు ఎంపీ డా. సంజీవ్​ కుమార్​. గురువారం గద్వాల కలెక్టర్​ను ఎంపీ కలిశారు. రైల్వే కోచ్​ రిహాబిలిటేషన్ వర్క్​కు తెలంగాణ ప్రభుత్వం 7.5 ఎకరాలు రైల్వే శాఖకు ఇవ్వాల్సి ఉందని, అదేవిధంగా నాగలదిన్నె బ్రిడ్జికు సంబంధించి ఇవ్వాల్సిన భూమి విషయంపై ఎంపీ డా. సంజీవ్​ కుమార్​ ఈ సందర్భంగా చర్చించారు.

ఇందుకు గద్వాల కలెక్టరు వల్లూరు క్రాంతి సానుకూలంగా స్పందించారు. రెండు ప్రాజెక్టులకు సంబంధించి త్వరగా పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చినట్లు కర్నూలు ఎంపీ డ. సంజీవ్​ కుమార్​ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

About Author