PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కురువలకు ఎంపీ…ఎమ్మెల్యే టికెట్లను కేటాయించాలి

1 min read

జగన్ మోహన్ రెడ్డి వైసీపీ రాబోవు లిస్ట్ లలో కురువలకు స్థానం కల్పించాలి

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటన సందర్భంగా కురువలకు యంపీ,ఎమ్మెల్యే స్థానాలను ప్రకటించాలి.కురువ, మదాసి కురువ,మదారి కురువ పొలిటికల్ జేఏసీ.

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  నగరంలోని స్థానిక బీసీ భవన్ లో కురువ,మదాసి కురువ/మదారి కురువ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ రవికుమార్,వైస్ చైర్మన్లు కురువ శ్రీనివాసరావు, కురువ బలరాం,మదాసి కురువ సుంకన్న,బత్తిన కిరణ్ కుమార్, మదాసి కురువ శివలింగం,సీజీ శివయ్య లు మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో అతిపెద్ద సామాజిక వర్గాలలో ఒకటై,ప్రతి నియోజకవర్గంలో 35వేల నుండి 75వేల వరకు జిల్లా వ్యాప్తంగా నాలుగు లక్షల ఓటుబ్యాంకు కలిగిన కురువ,మదాసి కురువ/మదారి కురువ సామాజిక వర్గానికి రాజకీయ పార్టీలు కర్నూలు పార్లమెంట్ స్థానం,రెండు ఎమ్మెల్యే స్థానాలను కేటాయించాలని ప్రధానంగా వైసీపీ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే తమ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తు లిస్టులను విడుదల చేస్తున్న నేపథ్యంలో కురువ,మదాసి కురువ,మదారి కురువ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు లిస్టులలో లేకపోవడం శోచనీయమని ముఖ్యమంత్రి, వైసీపీ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇకపైనా ప్రకటించే అభ్యర్థుల లిస్టులోనైన కురువ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా కురువ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులను యంపీ మరియు ఎమ్మెల్యే స్థానాలను ప్రకటించాలని కోరారు అలాగే వివిధ రాజకీయ పార్టీలు సైతం కురువ సామాజిక వర్గానికి రాజకీయ ప్రాధాన్యత కల్పించి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు లేని పక్షంలో కురువలను రాజకీయ నిర్లక్ష్యానికి గురిచేసిన పార్టీలను చిత్తుచిత్తుగా ఓడిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కురువ సురేంద్ర,కురువ పరుశురాముడు,కురువ మల్లప్ప తదితరులు పాల్గొన్నారు.

About Author