PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కర్నూలులో టీ టైమ్ స్టోర్ ప్రారంభించిన ఎంపీ టీజీ వెంకటేష్

1 min read

పల్లెవెలుగు వెబ్​ నగరంలోని బిర్లా కాంపౌండ్ లో ఉన్న యూసఫ్ ప్లాజాలో రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన టీ టైం షాపును రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు .ఈ కార్యక్రమంలో టి టైం నిర్వాహకులు రాజ్ కుమార్, న్యాయవాది దాశెట్టి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీ టైం ప్రత్యేకతను గురించి నిర్వాహకుడు రాజ్ కుమార్ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ కు వివరించారు. అనంతరం రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ కర్నూలు నగరంలో కార్పొరేట్ స్థాయిలో బ్రాండెడ్ షోరూంల తో పాటు వ్యాపారాలు అభివృద్ధి చెందడం అభినందనీయమని చెప్పారు. ముఖ్యంగా నిరుద్యోగ యువకులు టీ టైం ఇలాంటి షాపులను ఏర్పాటు చేసుకోవడం ద్వారా తాము ఉపాధి పొందడంతో పాటు మరికొంత మందికి ఉపాధి కల్పించడం అభినందనీయమన్నారు. టీ టైం షాపు వ్యాపార పరంగా అభివృద్ధి చెంది మరిన్ని శాఖ ఏర్పాటు చేయాలని ఆయన ఆకాంక్షించారు.

About Author