PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సచివాలయాన్ని తనిఖీ చేసిన ఎంపీడీఓ

1 min read

పల్లెవెలుగు, వెబ్ మిడుతూరు: మండల పరిధిలోని పీరు సాహెబ్ పేట గ్రామ సచివాలయాన్ని ఎంపీడీఓ జిఎన్ ఎస్ రెడ్డి తనిఖీ చేశారు.ఈసందర్భంగా ఎంపీడీఓ సిబ్బందితో మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది సమయపాలన తప్పనిసరిగా పాటించాలని అదేవిధంగా సిబ్బంది సచివాలయానికి వచ్చినప్పుడు మరియు వెళ్ళినప్పుడు రిజిస్టర్లో సమయం రాయాలని, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి ఉండేటట్లు చూడాలని అన్నారు. రికార్డులను ఆయన పరిశీలించిన తర్వాత జగనన్న కాలనీలో నిర్మిస్తున్న గృహాలను పరిశీలించారు.గృహాలను వేగవంతం చేయాలని గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క లబ్దారుడి ఇంటికి వెళ్లి వారికి అవగాహన కల్పించాలని సిబ్బందికి తెలియజేశారు.ఈకార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వినోద్,శ్రావణ్,శాంతి పాల్గొన్నారు.

About Author