NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎంపీడీవో ఆఫీస్.. పెట్రోల్ బాటిల్ తో యువ‌కుడి ఆందోళ‌న !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : అనంత‌పురం జిల్లా వజ్రకరూర్‌లో ఓ యువకుడు జీతం ఇవ్వలేదని పెట్రోల్ బాటిల్‌తో ఆందోళనకు దిగాడు. తనకు చెల్లించాల్సిన వేతనం చెల్లించి.. తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రకాష్ అనే యువకుడు ఎంపీడీవో కార్యాలయం వద్ద నిరసన తెలిపాడు. ఉపాధిహామీ పథకంలో వజ్రకరూర్ మండలం, గడేహోతురు గ్రామ క్షేత్ర సహాయకుడిగా 11 నెలల 15 రోజులు పని చేయించుకుని జీతం చెల్లించకుండా అన్యాయంగా తొలగించారంటూ బాధితుడు ఆరోపించాడు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్, పీడీ దృష్టికి తీసుకువెళ్లినా.. న్యాయం జరగలేదన్నాడు. పని చేస్తున్నా.. జీతం రాక తాను అప్పులపాలయ్యానన్నాడు.

                                         

About Author