PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సచివాలయాన్ని సందర్శించిన ఎంపీడీఓ

1 min read

పల్లెవెలుగు, వెబ్ ఏలూరు : ఏలూరుజిల్లా పెడవేగిమండలం మండలం లోని మండూరు.చక్రాయగూడెం సచివాలయాలను ఎంపిడిఓ జి రాజ్ మనోజ్ సందర్శించారు. గ్రామాలలో సచివాలయాల ద్వారా ఉద్యోగులు ప్రజలకు అందిస్తున్న సేవల ను అడిగి తెలుసుకున్నారు.సచివాలయాల ఉద్యోగుల విది విధానాల పై దిశా నిర్దేశం చేశారు. గ్రామాలలో ముఖ్యంగా వృద్దులకు, దివ్యఅంగులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు అందుతున్న పింఛన్ ల వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలనీ సచివాలయ ఉద్యోగులకు సూచించారు. గ్రామాలలో నిరుపేదలకు అందవలసిన సంక్షేమ పథకాలు అడిగి తెలుసుకుని అందని వారి వివరాల జాబితాలు అందుబాటులో ఉంచాలని చెప్పారు. గ్రామాలలో అవసరమైన వారికి హెల్త్ కార్డ్స్ అందించాలని చెప్పారు. గ్రామాలలో మంజూరైన ప్రభుత్వ గృహాలు, నిర్మాణాలు పూర్తి అయిన వివరాలు వివిధ దశలలో నిర్మాణాలలో ఉన్న గృహాల వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు. గ్రామాలలో బాంక్ ఖాతాలున్న ప్రతి వ్యక్తి బాంక్ ఎక్కౌంట్ కు ఆధార్ లింక్ తప్పని సరి అన్నారు. ఎంతమంది రైతులకు రైతు భరోసా అందుతుందనే వివరాలన్నిటి పై సచివాలయ ఉద్యోగులు చేసిన సర్వేలను ఉద్యోగుల విధులకు సంబంధించిన హాజరు ను ఎం పి డి ఓ రాజ్ మనోజ్ పరిశీలించారు.

About Author