NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాష్ట్రాల‌కు చేరిన `మిస్ట‌ర్ బ్యాలెట్ బాక్స్` !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : రాష్ట్రపతి ఎన్నికల్లో వినియోగించనున్న బ్యాలెట్‌ బాక్సులు విమానాల్లో రాష్ట్రాలకు చేరుకుంటున్నాయి. ఈ మేరకు రాష్ట్రాలకు చెందిన అధికారులతోపాటు విమానాల్లో వారి పక్క సీట్లను బ్యాలెట్‌ బాక్స్‌ల కోసం కేటాయించారు. ఈ మేరకు బాక్సుల కోసం ‘మిస్టర్‌ బ్యాలెట్‌ బాక్స్‌’ పేరిట కేంద్ర ఎన్నికల సంఘం విమాన టికెట్లు కొనుగోలు చేసింది. మంగళ, బుధవారాల్లో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు బ్యాలెట్‌ బాక్సులు చేరుకొనేలా చర్యలు తీసుకుంది. ఆయా వివరాలను మంగళవారం ఢిల్లీలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ) రాజీవ్‌ కుమార్‌ వెల్లడించారు.

                                              

About Author