PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎం ఆర్ పి ఎస్… నూతన కమిటీ ఎంపిక

1 min read

డివిజన్ అధ్యక్షులుగా గూల్యం ఎల్లప్ప మాదిగ , ఉపాధ్యక్షులుగా  హొళగుంద వెంకటేష్ మాదిగ

ప్రకటించిన ఎం ఆర్ పి ఎస్ రాయలసీమ జిల్లాల అధ్యక్షులు  చిప్పగిరి లక్ష్మీనారాయణ మాదిగ

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : మాదిగ కుల  హక్కులు రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్న  మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పత్తికొండ డివిజన్ నూతన కమిటీని ఎమ్మార్పీఎస్ రాయలసీమ జిల్లాల అధ్యక్షులు చిప్పగిరి లక్ష్మీనారాయణ మాదిగ శుక్రవారం ప్రకటించారు. ఎం ఆర్ పి ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్ జె ప్రకాష్ మాదిగ ఆదేశాలతో శుక్రవారం ఆలూరు పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఏర్పాటుచేసిన సమావేశంలో కొత్తగా ఏర్పాటు అయిన పత్తికొండ డివిజన్ స్థాయిలో  మాదిగల హక్కుల కోసం , రిజర్వేషన్ల పోరాటాన్ని సమర్థవంతంగా నడిపించడం కోసం  నాయకత్వం అవసరమైందని అందువల్ల హాలహర్వి, హొళగుంద మండలాల ఎం ఆర్ పి ఎస్  అధ్యక్షులుగా ప్రస్తుతం పని చేస్తున్న గూళ్యం ఎల్లప్ప మాదిగ, వెంకటేష్ మాదిగ లను పత్తికొండ డివిజన్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు గా ఎంపికచేసి ప్రకటించారు. విరితో పాటు డివిజన్ కార్యదర్శి గా వి గోవిందప్ప, ప్రధానకార్యదర్శి గా హులేబిడు రామలింగ లను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఎం ఆర్ పి ఎస్ రాయలసీమ జిల్లాల అధ్యక్షులు చిప్పగిరి లక్ష్మీనారాయణ మాదిగ మాట్లాడుతూ  కొత్తగా ఎంపికైన డివిజన్ కమిటీ సభ్యులు నేటినుంచి తమ భాద్యతలు స్వికరించి జాతి కోసం పని చేయాలనీ తెలిపారు. ప్రస్తుతం కొత్త కమిటీలు ఎంపిక చేసేవరకు హొళగుంద ఎం ఆర్ పి ఎస్ బాధ్యులుగా ఎలార్తి మహేష్ ను నియమించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమం లో ఎం ఆర్ పి ఎస్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

About Author