NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎంఎస్ఎఫ్ విద్యార్థి కమిటీ ఎన్నిక..

1 min read

పల్లెవెలుగు వెబ్​, ఆస్పరి: మండల పరిధిలోని చిగిలి గ్రామంలో శుక్రవారం ఎమ్మార్పీఎస్ మండల కన్వీనర్ రామాంజనేయులు ఆధ్వర్యంలో ఎంఎస్ఎఫ్ విద్యార్థి కమిటీ  నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ మండల కన్వీనర్ రామాంజనేయులు విద్యార్థుల సమక్షంలో గ్రామ అధ్యక్షుడిగా రవి కుమార్, గౌరవ అధ్యక్షుడు రాజు,సెక్రటరీ అనిల్ ,జాయింట్ సెక్రటరీగా నాగరాజును ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి భవిష్యత్తులో మంచి స్థాయిలో నిలవాలన్నారు. విద్యార్థులు అన్నదమ్ముల్లా కలిసిపోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో సురేంద్ర,వెంకటేష్ ,నాగరాజు ఉదయ్ ,వెంకటేష్ ,ఉదయ్, ఎన్నుకోవడం జరిగింది. ఎమ్మార్పీఎస్ నాయకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

About Author