PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పోయిన‌చోటే సాధించుకున్న ముఖేశ్ అంబానీ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇటీవ‌ల రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు 13 శాతానికి పైగా పుంజుకోవడంతో కంపెనీ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ వ్యక్తిగత సంపద కూడా భారీగా పెరిగింది. దీంతో ఆయన ఆసియాలోని అత్యంత ధనవంతుల జాబితాలో అగ్రస్థానాన్ని తిరిగి కైవసం చేసుకున్నారు. కొన్ని నెలల క్రితం అంబానీని వెనక్కి నెట్టి అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ ఈ స్థానాన్ని చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. బ్లూంబర్గ్‌ బిలియ నీర్స్‌ రియల్‌టైం ఇండెక్స్‌ ప్రకారం.. ఈ నెల 3 నాటికి 9,970 కోట్ల డాలర్ల సంపదతో ముకేశ్‌ అంబానీ ఆసియాతో పాటు భారత నం.1 ధనవంతుడి స్థానాన్ని తిరిగి దక్కించుకున్నారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 8వ స్థానంలో ఉన్నారు.

                                 

About Author