PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బీజేపీలో చేరిన ములాయం కోడలు !

1 min read

పల్లెవెలుగువెబ్ : సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ కోడలు అపర్ణాయాదవ్ బీజేపీలో చేరారు. ఉత్తరప్రదేశ్ బీజేపీ చీఫ్ స్వతంత్రదేవ్, యూపీ డిప్యూటీ సీఎం కేశవప్రసాద్ మౌర్యాల సమక్షంలో బీజేపీ తీర్థం స్వీకరించారు. తన అనుచరులతో కలిసి వచ్చిన అపర్ణా కాషాయ కండువా కప్పుకున్నారు.ములాయం చిన్నకోడలైన అపర్ణా యాదవ్ బీజేపీలో చేరడం సంచలనం రేపింది. ములాయం రెండవ భార్య సాధనా గుప్తా కుమారుడైన ప్రతీక్ యాదవ్ ను అపర్ణా 2011లో వివాహం చేసుకున్నారు. అపర్ణా 2017 ఎన్నికల్లో లక్నో కంటోన్మెంటు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి రీటా బహుగుణ చేతిలో ఓడిపోయారు.

    

About Author