PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మున్నేరు వాగు విషాదం.. న‌లుగురు చిన్నారుల వెలికితీత !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కృష్ణా జిల్లా చందర్ల‌పాడు మండ‌లం ఏటూరు వ‌ద్ద విషాదం చోటుచేసుకుంది. నిన్న మున్నేరు వాగులో న‌లుగురు చిన్నారులు గ‌ల్లంత‌య్యారు. పోలీసులు వారికోసం గాలింపు చేప‌ట్టారు. వారిలో నలుగురు చిన్నారుల మృతదేహాలను వెలికి తీశారు. బాల ఏసు, చరణ్‌, అజయ్‌తో పాటు మరో చిన్నారి మృతదేహాన్ని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వెలికితీసింది. మరో చిన్నారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. చిన్నారుల మృతదేహాలను చూసి బోరున తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపిస్తున్నారు. చిన్నారుల మృతితో ఏటూరులో విషాదఛాయలు అలముకున్నాయి.

                                         

About Author