PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జెండ‌ర్ మార్చాలంటూ మ‌స్క్ కొడుకు పిటిష‌న్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ మరోసారి వార్తల్లో నిలిచారు. మస్క్‌ ట్రాన్స్‌జెండర్ కొడుకు 18 ఏళ్ల గ్జావియర్ అలెగ్జాండర్ మస్క్ తన గుర్తింపులో జెండర్(లింగం)ను పురుషుడి నుంచి స్త్రీగా మార్పునకు కోర్టును అభ్యర్థించారు. ఈ మేరకు పేరులో మార్పులకు అనుమతి ఇవ్వాలని కోరుతూ లాస్‌ ఏంజెలస్ కంట్రీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన తండ్రి(బయోలాజికల్) ఎలాన్ మస్క్‌తో ఏ రూపంలోనూ బంధాన్ని కోరుకోవడంలేదని, తండ్రి గుర్తింపు అక్కర్లేదని, అందుకే పేరులో మార్పులు చేసుకుంటున్నట్టు గ్జావియర్ తెలిపాడు. తన తండ్రి పేరుతో జీవించేందుకు ఇష్టం లేదని వివరించాడు.

                             

About Author