NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బాలీవుడ్ ఉన్న‌తికి ముస్లింలే కార‌ణం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాగపూర్ లో ఆయన ముస్లిం మైనారిటీ వర్గాలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, బాలీవుడ్ కు ప్రస్తుతం ముస్లింలే విశేష రీతిలో సేవలందిస్తున్నారని తెలిపారు. కళలు, ఉర్దూలో సాహిత్యం, రచనలు… ఇలా అనేక విధాలుగా ముస్లిం సమాజం తన భాగస్వామ్యాన్ని అపారంగా చాటుకుంటోందని వెల్లడించారు. ఇవాళ బాలీవుడ్ ఈ స్థాయిలో ఉందంటే ముస్లిం మైనారిటీల సహాయసహకారాలే ప్రధాన కారణమని శరద్ పవార్ ఉద్ఘాటించారు. దేశంలో అతిపెద్ద వర్గాల్లో ఒకటిగా ఉన్న ముస్లింలు తమకు రావాల్సిన వాటా రావడంలేదన్న అసంతృప్తితో ఉన్నారని, వారు అసంతృప్తి చెందడంలో తప్పేమీలేదని శరద్ పవార్ అన్నారు. వారు తమ వాటాను ఎలా పొందాలన్నదానిపై చర్చ జరగాలని సూచించారు.

                                        

About Author