PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టిడిపి పార్టీకి  ముస్లీంలు  మ‌ద్ద‌తు…  క‌ర్నూలు టిడిపి ఇంచార్జి టి.జి భ‌ర‌త్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  క‌ర్నూల్లో ఉన్న ముస్లీంలంద‌రూ తెలుగుదేశం పార్టీకి మ‌ద్ద‌తు ఇస్తున్నార‌ని క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భ‌ర‌త్ అన్నారు. రానున్న తెదేపా, జ‌న‌సేన ప్ర‌భుత్వంలో అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు మంచి జ‌రుగుతుంద‌ని చెప్పారు. 5వ వార్డులో నిర్వ‌హించిన ముస్లీంల ఆత్మీయ స‌ద‌స్సులో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా వార్డుకు చెందిన మియా బాషా, స‌య్య‌ద్ మోహిద్‌, ఖాద్రి, ముల్తానీ, హ‌బీబ్ లు తెలుగుదేశం పార్టీలో చేరారు. అనంత‌రం టి.జి భ‌ర‌త్ మాట్లాడుతూ క‌ర్నూల్లో తెలుగుదేశం పార్టీ రోజురోజుకూ బలోపేతం అవుతోంద‌న్నారు. ఏ వార్డులో చూసినా స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్న ప్ర‌జ‌లు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిడిపిని గెలిపించుకోవాల‌ని చూస్తున్నార‌న్నారు. తాను గెలిస్తే మ‌హిళ‌ల‌కు స్వ‌యం ఉపాధి క‌ల్పించ‌డంతో పాటు యువ‌త‌కు ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు వ‌చ్చేలా కృషి చేస్తాన‌ని తెలిపారు. క‌ర్నూల్లో పుట్టి పెరిగిన త‌న‌కు కుల‌, మ‌త బేధాలు లేవ‌న్నారు.  కొంద‌రు రాజ‌కీయ నాయ‌కులు కేవ‌లం మ‌తం పేరుతో ఎన్నిక‌ల్లో నెగ్గాల‌ని చూస్తార‌న్నారు. అయితే గెలిచిన త‌ర్వాత ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే ప‌నులేమీ చెయ్య‌ర‌న్నారు. టిడిపి హ‌యాంలో వ‌చ్చిన ఉర్దూ యూనివ‌ర్శిటీనీ ఇప్ప‌టికీ పూర్తి చేయ‌లేద‌న్నారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల‌న్న ఉద్దేశంతో ఇండ‌స్ట్రియ‌ల్ జోన్ తెచ్చి, విమానాశ్ర‌యం ఏర్పాటుచేసిన ఘ‌న‌త చంద్ర‌బాబుకు ద‌క్కుతుంద‌న్నారు. ఈ ప్ర‌భుత్వంలో ఒక్క ప‌రిశ్ర‌మ కూడా తీసుకురాలేద‌న్నారు. ఇవ‌న్నీ యువ‌త అర్థంచేసుకుంటున్న‌ట్లు చెప్పారు. త‌న‌ను గెలిపించేందుకు పెద్ద ఎత్తున ముస్లీంలు మ‌ద్ద‌తు ఇవ్వ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. గెలిచిన త‌ర్వాత అంద‌రికీ మేలు చేస్తాన‌ని హామీ ఇచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో టిడిపి న‌గ‌ర అధ్య‌క్షుడు నాగ‌రాజు యాద‌వ్‌, మ‌హిళా అధ్య‌క్షురాలు రాజ్య‌ల‌క్ష్మి, వార్డు నేత‌లు చెన్నారెడ్డి, బాలు, ఎజాష్‌, రాజేష్, హిదాయ‌త్‌,  ల‌లిత‌మ్మ‌, ఇంద్ర‌జ‌, నాగ‌రాజు, ష‌ఫి, భాస్క‌ర్‌, త‌దిత‌రులు పాల్గొన్నారు.

About Author