PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క్రీడల్లోనూ రాణించాలి: డా.ఎన్​. శమంతక మణి

1 min read

పల్లెవెలుగు వెబ్​: కర్నూలు నగరంలోని పెద్ద మార్కెట్ లక్ష్మీ కళ్యాణ మండపం ఆవరణలో  ఆదివారం  టైక్వాండో సాధన చేసిన విద్యార్థులకు బ్యాగులు మరియు పోటీల్లో పాల్గొన్న పిల్లలకు మెడల్స్ మరియు పోస్ట్ కార్డు అందజేశారు నగరూరు సుబ్రహ్మణ్యం చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు డాక్టర్ ఎన్. శమంతక మణి. అంతకు ముందు టైక్వాండో విన్యాసాలు చేసిన చిన్నాఆరులను ఆమె పరిచయం చేసుకు.. మెడల్స్, బ్యాగులు పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా డా. శమంతకమణి మాట్లాడుతూ  ఆత్మరక్షణకు కరాటే టైక్వాండో ఎంతో ఉపయోగపడుతుందని, ప్రతి ఒక్క విద్యార్థి సాధన చేయాలని సూచించారు.  చిన్నతనం నుంచే క్రీడల్లో తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలి అని తెలిపారు ఈ కార్యక్రమంలో టి వెంకటేశ్వర్లు తేజ అజయ్ అఖిల్ సాయి రోహిత్ వెంకటేష్ నాగరాజు నందిని శివమణి శివ శంకర్ రెడ్డి సంజు విశాల్ ఉదయ్ మధు భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.

About Author