PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాయ‌ల‌సీమ టోర్నమెంట్​ను విజ‌య‌వంతం చేయాలి : టి.జి భ‌ర‌త్‌

1 min read

పల్లెవెలుగు వెబ్​: రాయ‌ల‌సీమ వ్యాప్తంగా బ్యాడ్మింట‌న్ క్రీడ‌ పోటీల కోసం త‌ర‌లివ‌చ్చే క్రీడాకారుల‌కు అన్ని ర‌కాల వ‌స‌తులు క‌ల్పించి పోటీల‌ను విజ‌య‌వంతం చేయాల‌ని క‌ర్నూలు జిల్లా బ్యాడ్మింట‌న్ అసోసియేష‌న్ ప్రెసిడెంట్ టి.జి భ‌ర‌త్ అన్నారు. శ‌నివారం న‌గ‌రంలోని మౌర్య ఇన్ లో  రాయ‌ల‌సీమ స‌బ్ జూనియ‌ర్‌, ఓపెన్ మెన్ బ్యాడ్మింట‌న్ చాంపియ‌న్ షిప్ 2022 పోటీల‌కు సంబంధించిన బ్రోచ‌ర్‌ను ఆయ‌న ఆవిష్కరించారు. అనంత‌రం టి.జి భ‌ర‌త్ మాట్లాడుతూ టిజిబి యూత్ మ‌రియు ఎస్.ఆర్‌.ఏ బ్యాడ్మింట‌న్ అకాడ‌మీ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్న‌ట్లు చెప్పారు. పోటీలను విజ‌య‌వంతం చేస్తామ‌న్నారు. అండ‌ర్ 11, అండ‌ర్ 15, అండ‌ర్ 17 బాలురు, బాలిక‌లు, మెన్ డ‌బుల్స్ పోటీలు నిర్వహిస్తున్న‌ట్లు తెలిపారు. ఈ నెల 18, 19వ తేదీల్లొ జ‌రిగే ఈ పోటీలు న‌గ‌రంలోని ఎస్‌.ఆర్‌.ఏ బ్యాడ్మింట‌న్ అకాడ‌మీలో నిర్వ‌హిస్తున్నామ‌న్నారు.

About Author