NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘ఒలంపిక్’లో విజయంతో తిరిగి రావాలి

1 min read

– రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు : టోక్యోలో జరగనున్న ఒలింపిక్ పోటీలలో పాల్గొనేందుకు వెళ్తున్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన క్రీడాకారులు విజయంతో తిరిగి రావాలని రాజ్యసభ సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు టీజీ వెంకటేష్ ఆకాంక్షించారు. నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఒలంపిక్ క్రీడాకారులకు చీర్స్ చెప్పేందుకు ఏర్పాటుచేసిన ‘ఐ చీర్ ఫర్ ఇండియా ’ సెల్ఫీ స్టాండ్ ద్వారా రాజ్యసభ సభ్యుడు రాష్ట్ర క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సెట్కూర్ సీఈవో నాగరాజు నాయుడు, క్రీడా శాఖ ప్రధాన శిక్షకులు రాజు, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి రామాంజనేయులు ,వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు భూపతి రావు, అవినాష్, సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ రాష్ట్రం నుంచి క్రీడాకారులు పీవీ సింధు, సాయిరాజ్ ,రజని పోటీల్లో పాల్గొంటున్నారని, వారు విజయం సాధించి తిరిగి రావాలని అభిలాషించారు.

About Author