PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రజా సమస్యలు తీర్చడమే నా మొదటి ప్రాధాన్యం.. టిజి భరత్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు ఎమ్మెల్యే అవ్వగానే ప్రజల ఇబ్బందులన్నీ తొలగించేందుకు కృషి చేస్తానని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి టిజి భరత్ అన్నారు. నగరంలోని రెండవ వార్డు పరిధిలోని అలిశరిబాగులో భరత్ వార్డు పర్యటన చేపట్టారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రజలు తీజి భరత్ కు సమస్యలను మొరపెట్టుకున్నారు. వర్షం వస్తే కాలువలు నిండి నీరు మొత్తం రోడ్డుపై ప్రవహిస్తోందని చెప్పారు. రోడ్లు లేవని, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని మొరపెట్టుకున్నారు. అర్హులైనప్పటికీ పెన్షన్లు ఇవ్వడం లేదని వాపోయారు. ఈ సందర్భంగా స్పందించిన టీజీ భరత్ మాట్లాడుతూ తనకు ఎమ్మెల్యేగా ఒక అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. నాయకుడు సరైన వ్యక్తి ఉంటే ప్రజలకు ఇబ్బందులు ఉండవన్నారు. అందుకే తనను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని కోరారు. ప్రజల సమస్యలన్నీ తాను తెలుసుకుంటున్నానని.. తాను ఎమ్మెల్యే అవ్వగానే వార్డులోని ప్రజల సమస్యలను తీర్చేందుకు మొదటి ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. దీంతోపాటు స్థానికంగా పరిశ్రమలు తీసుకొచ్చి కర్నూల్ లో ఉన్నటువంటి యువతకు ఉద్యోగాలు కల్పించడంతోపాటు ప్రజలకు ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తానని భరత్ ప్రజలకు హామీ ఇస్తూ ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు హమీద్, సాదిక్, ఖుషి, సాయబ్, సోను, ఫయాజ్, రసూల్ తదితరులు పాల్గొన్నారు.

About Author