PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

 ఎస్​డిపిఐ ఎపి రాష్ట్ర నూతన కార్యదర్శిగా ఎన్.అబ్దుల్ సుభాన్

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్టిపిఐ పార్టీ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసింది. ఈ నూతన కార్యవర్గంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన కార్యదర్శిగా హెూలగుంద గ్రామానికి చెందిన ఎస్ డి పి ఐ నాయకులు ఎన్. అబ్దుల్ సుభాన్ ను ఎన్నుకున్నట్లు రాష్ట్ర కమిటీ మంగళవారం ఓ ప్రకటనలో విడుదల చేసింది. దీంతో మండలంలోని ఎస్ డి పి ఐ నాయకులలో నూతన ఉత్సాహం నెలకొంది. నూతనంగా ఎన్నికైన ఏపీ రాష్ట్ర ఎస్ డి పి ఐ కార్యదర్శి మాట్లాడుతూ పార్టీ పెద్దలు నాయకులు తమను గుర్తించి బాధ్యతతో రాష్ట్ర కార్యవర్గంలో చోటు కల్పించినందుకు వారికి శుభాభినందనలు తెలిపారు. అలాగే పార్టీ పెద్దలు ఇచ్చిన గుర్తింపుకు మన్నికగా పార్టీ అభివృద్ధికి గ్రామస్థాయి నుండి కృషి చేస్తానని ఆయన అన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *