PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నా ద‌మ్ము, ధైర్యం ప‌వ‌న్ క‌ళ్యాణ్

1 min read

హీరో నితిన్, హీరోయిన్ కీర్తి సురేష్ జంట‌గా న‌టించిన ‘ రంగ్ దే ’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైద‌రాబాద్ లోని శిల్పక‌ళావేదిక‌ లో అట్టహాసంగా జ‌రిగింది. ప్రముఖ ద‌ర్శకుడు త్రివిక్రమ్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. రాక్ స్టార్ దేశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం సితార ఎంట‌ర్ టైన్ మెంట్ బ్యాన‌ర్ మీద తెర‌కెక్కింది. ఈ నెల 26 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన ఈవెంట్ లో హీరో నిత‌న్ మాట్లాడారు. త‌న‌కు ఇండ‌స్ట్రీలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ , త్రివిక్రమ్ రెండు క‌ళ్లలాంటి వార‌ని అన్నారు. త‌న ద‌మ్ము ధైర్యం ప‌వ‌న్ క‌ళ్యాణ్ అని అన్నారు. ఆ ధైర్యంతోనే ముందుకు సాగుతున్నాన‌ని తెలిపారు. త‌న ప్రతి ప్లాప్ త‌ర్వాత సితార ఎంట‌ర్టైన్మెంట్ బ్యాన‌ర్ హిట్ ఇస్తూ వ‌స్తోంద‌ని.. సెంటిమెంట్ ప్ర‌కారం ఈ సినిమా కూడ హిట్ అవుతుంద‌ని నితిన్ అన్నారు. ఇటీవ‌ల తాను న‌టించిన చెక్ సినిమా అస్సాం పోయింద‌ని, ఈ సినిమా విష‌యంలో అలా జ‌ర‌గ‌ద‌ని హామి ఇచ్చారు. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర పెద్ద ఎసెట్ అని అన్నారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ మ‌హానాటు, మ‌హానాటీ పాత్ర చేసింద‌న్నారు.

About Author