PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పదవి ఉన్నా లేకపోయినా నాధ్యాస వైసీపీ వైపే

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని పైపాలెం గ్రామానికి చెందిన షేక్ ఇనాయతుల్ల ముఖ్యమంత్రిని కలిశారు.నంద్యాల జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వహక మాజీ సభ్యులు(ఎగ్జిక్యూటివ్ మెంబర్)రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పూలబోకెను ముఖ్యమంత్రికి అందజేశారు.మంగళవారం రోజున డోన్ లో నీటి కాలువల ప్రారంభోత్సవానికి వచ్చిన ముఖ్యమంత్రిని ఆయన కలిశారు.నాకు పదవులు ఉన్నా లేకపోయినా ఒక్కటే నని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపే నా ధ్యాస ఉంటుందని.పదవులు ఈరోజు ఉంటాయి రేపు పోతాయని నా పదవి పోయినా కూడా నేను బాధ పడలేదని అయినా సరే నేను పార్టీ కోసం నిరంతరం కష్టపడుతూనే ఉంటానని ఇ నాయతుల్ల అన్నారు.

About Author