PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘శ్రీ భక్త మార్కెండేయ స్వామి’కి… నాగభరణం విరాళం…

1 min read

పల్లెవెలుగు వెబ్​, ఎమ్మిగనూరు: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని శ్రీ భక్త మార్కెండేయ స్వామి దేవాలయానికి బోడ గురుస్వామి కుటుంబ సభ్యులు నాగభరణం విరాళంగా అందజేశారు. దేవాలయంలోని శివలింగానికి నాగభరణం విరాళంగా ఇచ్చిన దాత బోడ గురుస్వామిని శనివారం సాయంత్రం పద్మశాలి బహుత్తమ సంఘం అధ్యక్షులు  విశ్వనాథ్​  రమేష్​ ఘనంగా శాలువా కప్పి సన్మానించారు. పద్మశాలి కుటుంబీకులు ప్రతిఒక్కరూ దేవాలయ అభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా అధ్యక్షులు విశ్వనాథ్​ రమేష్​ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ట్రెజరర్ దోమ భీమేష్, ఆర్గనైజ్ సెక్రెటరీ మ్ మాన. సత్యనారాయణ, యువజన సంఘం అధ్యక్షులు పోలే. శ్రీనివాసులు, ట్రెజరర్ ఉరుకుందు, ఎమ్మిగనూరు పట్టణ పద్మశాలి యువజన సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

About Author