PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నాగలూటి భారతమ్మ గుండెపోటుతో మృతి

1 min read

– నివాళులు అర్పించిన ప్రజాప్రతినిధులు

పల్లెవెలుగు వెబ్  మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండలం పరిధిలోని నాగలూటి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కీర్తిశేషులు తమిదెల పెద్ద పుల్లారెడ్డి సతీమణి టి.భారతమ్మ(70) గుండెపోటుతో మృతి చెందారు.కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు శుక్రవారం ఉదయం 8:30 కు ఇంటి దగ్గర గుండె నొప్పి వస్తుందని చెప్పడంతో హుటా హుటిన కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.కానీ అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారన్నారు.వీరి కుటుంబ నేపథ్యం అంతా కూడా రాజకీయ కుటుంబం అనే చెప్పవచ్చు.ఈమె భర్త పెద్ద పుల్లారెడ్డి గతంలో రెండు సార్లు గ్రామ సర్పంచ్ గా పని చేశారు. తర్వాత ఈమె పెద్ద కోడలు టి. ఉషారాణి ప్రస్తుత సర్పంచ్ గా ఉన్నారు.ఈమె చిన్న కుమారుడు నాగ తులసిరెడ్డి సహకార సొసైటీ చైర్మన్ గా కొనసాగుతున్నారు.ఈరోజు శనివారం ఉదయం 10 గంటలకు గ్రామంలో అంత్య క్రియలు నిర్వహిస్తున్నట్లు తులసిరెడ్డి తెలిపారు. ఇప్పటివరకు మంచిగా ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందడం పట్ల కుటుంబ సభ్యుల్లో మరియు గ్రామంలో విషాదఛాయలు అలుముకు న్నాయి.నందికొట్కూరు మున్సిపాలిటీ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి,నందికొట్కూరు వైసీపీ నాయకులు వై.చంద్రమౌళి,జబ్బార్,తిమ్మాపురం సర్పంచ్ నాగ స్వామి రెడ్డి మరియు తదితర ప్రజా ప్రతినిధులు నాయకులు గ్రామానికి చేరుకుని పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

About Author