PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క‌ర్నూల్లో నాగార్జున సినిమా ప్రీరిలీజ్ వేడుక !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నాగార్జున కథానాయకుడిగా ‘ది ఘోస్ట్’ సినిమా రూపొందింది. సునీల్ నారంగ్ .. శరత్ మరార్ .. రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమాకి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించాడు. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో నిర్మితమైన ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 5వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 25వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నట్టు ప్రకటించారు. ఈ ఈవెంట్ కి ‘కర్నూల్’ వేదిక కానుంది. అక్కడి ఎస్.టి.బి.సి కాలేజ్ గ్రౌండ్స్ లో ఈ ఫంక్షన్ ను నిర్వహించనున్నారు. ఆ రోజున నాగచైతన్య – అఖిల్ ఇద్దరూ కూడా ఈ వేడుకకి హాజరు కానున్న విషయాన్ని తెలియజేస్తూ పోస్టర్ ను వదిలారు.

                                             

About Author