PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఒకే వేదిక పైకి నంద‌మూరి, మెగా ఫ్యామిలీలు ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం చోటు చేసుకోనుంద‌న్న వార్త‌లు గుప్పుమంటున్నాయి. ఎవరూ ఊహించని కాంబినేషన్ తెరపైకి రాబోతోంద‌న్న టాక్ మొద‌లైంది. మెగా -నందమూరి కుటుంబాలకు చెందిన సూపర్ స్టార్స్.. ఒకే వేదికపై ఎన్నికల ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారన్న‌ చర్చ హాట్ హాట్ గా మారింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి అధినేతగా రాజకీయాల్లో.. సంచలనంగా మారాలని ప్రయాత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి.. ఓటమిపాలైనా.. నిరాశ చెందకుండా.. ఇప్పుడు తన పార్టీనే అధికారంలోకి తేవాలనే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. పవన్ ప్రస్తుతం బీజేపీ పొత్తుతో ఎన్నికలకు వెళ్తున్నారు. ఇప్పటికే బీజేపీతో కలిసే ఉన్నారు. ఎన్నికల నాటికి ఆయన బీజేపీతో కలిసి కొనసాగుతూనే టీడీపీని కలుపుకుంటారా.. లేకా.. బీజేపీని వదిలి టీడీపీతో వెళ్తారా.. అన్నది ఇంకా క్లారిటీ లేదు.

                                        

About Author