NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నందికొట్కూరును.. కర్నూలు జిల్లాలోనే కొనసాగించాలి…

1 min read

 పల్లెవెలుగువెబ్ ,మిడుతూరు: నందికొట్కూరు ను కర్నూలు జిల్లాలోనే కొనసాగించాలని కోరుతూ చెరుకు చెర్ల గ్రామంలో ఎమ్మెల్యే తోగురు ఆర్థర్ కు సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు నరసింహుడు, ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్ తదితరుల ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. నందికొట్కూరు నుంచి కర్నూలు కు 25 కిలోమీటర్లు మాత్రమే ఉందని నందికొట్కూరు ప్రజల అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి కర్నూలు జిల్లాలోనే కొనసాగించాలని వారు ఎమ్మెల్యే కు వినతి పత్రాన్ని అందజేశారు.తిమ్మాపురం గ్రామంలో నాగన్న ఇచ్చిన విందు కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్  వంగాల భరత్ కుమార్ రెడ్డి,రఘురామయ్య,గోవర్ధన్ రెడ్డి,దేవనూరు షరీఫ్,రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్ సు కురు మియా మరియు వివిధ గ్రామాల వైసిపి నాయకులు పాల్గొన్నారు.

About Author