PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వీహెచ్​పీ దక్షిణ ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర అధ్యక్షుడిగా నందిరెడ్డి సాయిరెడ్డి

1 min read

పల్లెవెలుగు వెబ్​: విశ్వహిందూ పరిషత్ దక్షిణాంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వర్షారంభ సమావేశాలు 16,17 తేదీలు శని,ఆదివారాలలో హిందూపురం లోని వాసవీ సదన్ లో  జరిగాయి,ప్రతిసంవత్సరం సంస్థ పనిలో సౌలభ్యం కోసం మార్పులు,చేర్పులు జరుగుతుంటాయి దానిలో భాగంగా విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యాధ్యక్షులుగా ఇంతవరకు బాధ్యతలు నిర్వహించిన నందిరెడ్డి సాయిరెడ్డి ఇప్పటి నుండి రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలను కేంద్రీయ కార్యాధ్యక్షులు అలోక్   కుమార్ జీ కండువా కప్పి బాధ్యతలను అప్పజెప్పారు…  అలాగే కర్నూలు విభాగ్ ధర్మప్రసార్ కన్వీనర్ గా కాళంగిరి విజయుడు,కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులుగా డా.లక్కిరెడ్డి అమరసింహారెడ్డి,శ్రీమతి రజనీ కల్కూర,జిల్లా కార్యదర్శిగా మాళిగి భానుప్రకాష్, జిల్లా మాతృశక్తి కన్వీనర్ గా శ్రీమతి జంపాల రాధిక,కర్నూలు నగర అధ్యక్షులు గా గోరంట్ల రమణ,నగర కార్యదర్శిగా ఈపూరి నాగరాజులు గారలను రాష్ట్ర నూతన అధ్యక్షులు నందిరెడ్డి సాయిరెడ్డి కండువా కప్పి బాధ్యతలను అప్పగించారు. వీరందరికీ ప్రాంత,విభాగ్,జిల్లా,నగర కార్యకారిణి శుభాకాంక్షలు తెలియజేశారు.

About Author