NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నాని నిజస్వరూపం బయటపడుతుందని అడ్డుకుంటున్నారు !

1 min read

పల్లెవెలుగువెబ్ : మంత్రి కొడాలి నాని నిర్వహించిన జూద క్రీడలు బయటపడతాయన్న భయంతోనే టీడీపీ నిజనిర్ధారణ కమిటీని వైసీపీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు మంత్రి కొడాలి నాని ఎటువంటి సమావేశాలు పేట్టలేదన్నారు. ఇవాళ కే కన్వెన్షన్‌లో ఎస్సీ సెల్ సమావేశం నిర్వహించడం, అతని భయాన్ని తెలియజేస్తుందని నారాయణరావు అన్నారు. గుడివాడలో క్యాసినో వ్యవహరం పై టీడీపీ నిజనిర్ధారణ కమిటీ వేసింది. ఈ కమిటీ కొడాలి నానికి చెందిన కే కన్వెన్షన్ ప్రాంతాన్ని పరిశీలించేందుకు గుడివాడ వెళ్లింది. దీంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ ఎత్తున మోహరించారు.

      

About Author