PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్ర‌తి ముస్లిం నారా హమారా.. టి.జి భ‌ర‌త్ హ‌మారా అనుకోవాలి..

1 min read

కొత్త‌పేట 51వ వార్డులో ముస్లింల‌తో క‌లిసి ఇంటింటి ప్ర‌చారం

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  క‌ర్నూల్లో ఉన్న ప్ర‌తి ముస్లిం సోద‌రుడు నారా హ‌మారా.. టి.జి భ‌ర‌త్ హ‌మారా అనుకోవాల‌ని క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గ తెలుగుదేశం పార్టీ అభ్య‌ర్థి టి.జి భ‌ర‌త్ అన్నారు. మైనారిటీ న‌గ‌ర క‌మిటీ ఆధ్వ‌ర్యంలో న‌గ‌రంలోని 51వ వార్డు ప‌రిధిలోని కొత్త‌పేట‌లో నారా హ‌మారా టి.జి భ‌ర‌త్ హ‌మారా కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా ముస్లింల ఇళ్ల వ‌ద్ద‌కు వెళ్లి తెలుగుదేశం పార్టీ సూప‌ర్ 6 ప‌థ‌కాల‌తో తాను రూపొందించిన 6 గ్యారెంటీల‌ను టి.జి భ‌ర‌త్ వివ‌రించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేయాల‌ని పెద్ద‌లు, మ‌హిళ‌లు, యువ‌త‌ను కోరారు. ఈ 40 రోజులు కులం పేరుతో చేసే రాజ‌కీయ మాయ‌లో ప‌డొద్ద‌ని.. కుల‌, మ‌త బేధం లేకుండా అభివృద్ధి జ‌ర‌గాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల‌న్నారు. మైనారిటీ నాయ‌కులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి కార్య‌క్ర‌మం చేయ‌డం సంతోషించే విష‌య‌మ‌న్నారు. ఇక‌ తాను తీసుకొచ్చిన 6 గ్యారెంటీలు గెలిచిన త‌ర్వాత అమ‌లుచేయ‌క‌పోతే 2029 ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌న‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మైనారిటీ న‌గ‌ర క‌మిటీ అధ్య‌క్షుడు హ‌మీద్, టిడిపి రాష్ట్ర మైనారిటీ సెల్ కార్య‌ద‌ర్శి జ‌హంగీర్ బాషా, స్టేట్ మైనారిటీ ఆర్గ‌నైజింగ్ సెక్ర‌ట‌రీ మ‌న్సూర్ ఆలీఖాన్‌, మెహ‌బూబ్, గౌస్, ఇబ్ర‌హీం, అబ్దుల్ ర‌జాక్, జుబేర్ ఖాన్, రెహ‌మ‌త్, ఇమ్రాన్, స‌లీంఖాన్, ఖాజా, ఖాజామొహిద్దీన్, అన్వ‌ర్ బాషా, జ‌హంగీర్ బాషా, షోయ‌బ్, మున్నా,త‌దిత‌ర ముఖ్య నాయ‌కులు, బూత్ ఇంచార్జీలు పాల్గొన్నారు.

About Author