PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

యువగలంలో అడుగడుగునా నారా లోకేష్ కి నీరాజనం

1 min read

– వైసిపి అరాచకాలను ప్రజలు తెలియపరుస్తున్నారు:- వై.నాగేశ్వరరావు యాదవ్
– తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్
– జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్
పల్లెవెలుగు వెబ్​ కర్నూలు: రాష్ట్ర వైసీపీ ప్రభుత్వ అరాచకాలను, తెలుగుదేశం పార్టీ నాయకుల పై జరుగుతున్న దాడులను నిరసిస్తూ ఈరోజు కర్నూలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది.ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్వై.నాగేశ్వరరావు యాదవ్ గారు రాష్ట్ర కార్యదర్శి నాగేంద్ర గృ,ఎస్సీ సెల్ అధ్యక్షులు జేమ్స్ గారు, రాజు గారు,బాల వెంకటేశ్వర్ రెడ్డి గారు, మహేష్ గౌడ్ గారు,గున్నా మార్క్ ,రామాంజనేయులు గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలుఈ సందర్భంగా వై.నాగేశ్వరరావు యాదవ్ గారు మాట్లాడుతూ:తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఉమ్మడి కర్నూలు జిల్లాలో యువగలం పాదయాత్ర ప్రవేశించడం జరిగినది. తెలుగుదేశం పార్టీలో అనేక టెక్నాలజీ ప్రవేశపెట్టి అనేక రూపకల్పనలు నారా లోకేష్ గారు చేసారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో నారా లోకేష్ గారు పాదయాత్ర ప్రవేశించి దాదాపు 15 రోజులు అవుతుంది.గ్రామాలలో, పట్టణాల్లో కనిపించే దృశ్యాలను గుర్తు చేసుకుంటే అన్ని రకాల వర్గాల వారు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్లు, వ్యాపారసలు,ఉద్యోగులు, ముఖ్యంగా యువత,మహిళలు, వృద్దులు అన్ని వర్గాల వారు కూడా తమ యొక్క కష్టాలను,తమకు ఈ ప్రభుత్వంలో జరిగిన దాడులు, అన్యాయాలను,భూకబ్జాలను వీటన్నిటి అంశాలను నారా లోకేష్ గారికి వివరిస్తూ పేద ప్రజల కంట నీరు కారుస్తున్నారు. పేద ప్రజల కంటి నీటిని చూసి చలించిపోయి, తెలుగుదేశం పార్టీ హయాంలోకి వచ్చిన వెంటనే మీ కన్నీటిని తుడిచే బాధ్యతను నేను చేపడతానని నారా లోకేష్ గారు ప్రజలకు హామీ ఇవ్వడం జరిగినది. ముఖ్యంగా రాయలసీమలో తాగు సాగు నీటికి చాలా ఇబ్బందులు గురవుతున్నారని ఈ అంశంపై నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లగా నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి రాయలసీమ జిల్లాలకు పూర్తిగా తాగు సాగు నీటిని అందిస్తానని హామీ ఇవ్వడం జరిగినది . జలాలను మళ్లించి గుండ్రేవుల వేదావతి వంటి ముఖ్య ప్రాజెక్టులను పూర్తిచేస్తాం అని హామీ ఇవ్వడం జరిగినది. కచ్చితంగా పేద ప్రజల కళ్ళల్లో వెలుగు చూస్తాం. గ్రామాలలో యువగలం పాదయాత్ర చేపట్టినప్పుడు ప్రజలు నారా లోకేష్ గారికి ఎదురెళ్ళి మీ నాయకత్వం ఈ రాష్ట్రానికి కావాలని తెలియపరుస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఫలితం వచ్చాయో వైసీపీ వాళ్లు డబ్బులు పంచినా కూడా వారిని ఓడించి తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టడం జరిగినది. జనరల్ ఎలక్షన్లలో కూడా ఇదే రిపీట్ అవుతుంది. వైసిపి నాయకులు తెలుగుదేశం పార్టీకి ప్రజల ఆధరన చూసి వోర్వ లేక కార్యకర్తలను వుసిగొలిపి దాడులు చేపిస్తున్నారు. ఈ వైసీపీ నాయకులకు ఎక్కడికక్కడ ప్రజలే సరైన సమాధానాలు చెబుతున్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. సర్వ నాశనం చేశారు వైసీపీ నాయకులు. ప్రజల కళ్ళలో కానీ ప్రజల ఆధారంలో కానీ చూస్తా ఉంటే తెలుగుదేశం పార్టీ గెలవడం ఖాయం చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రి కావడం ఖాయం.

About Author