PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కడపలో…నారా లోకేష్ ప్రెస్ మీట్

1 min read

– ఏపీ లో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదు రాజారెడ్డి రాజ్యాంగం అమలు జగన్ రెడ్డి
పల్లెవెలుగు, వెబ్​ కడప : ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ రాజ్యాంగం తుంగలో తొక్కి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు, మంగళవారం ఆయన పొద్దుటూరు టిడిపి ఇన్చార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి అక్రమ అరెస్ట్ పై ఆయనను పరామర్శించడానికి విచ్చేసిన నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యల పై పోరాడినా, ప్రశ్నించినా టిడిపి నాయకుల్ని, కార్యకర్తల్ని అరెస్ట్ చేసి, అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆయన పోలీసులపై మండిపడ్డారు, రాష్ట్రంలో పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్ మర్చిపోయారని… జగన్ పీనల్ కోడ్ అమలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు, జగన్ రెడ్డి పాలనలో రివర్స్ పోలీసింగ్ నడుస్తుందని బాధితులపైనే కేసులు పెట్టడం జరుగుతుందని… ఇది జగన్ రెడ్డి రివర్స్ పోలీసింగ్ స్పెషల్ మీ ఆయన దుయ్యబట్టారు, జగన్ రెడ్డి మూడేళ్ల పాలనలో60 మంది టిడిపి ముఖ్యనాయకుల పై, అలాగే 5 వేల మంది కార్యకర్తల పై అక్రమ కేసులు పెట్టారన్నారు, ఇప్పటివరకు 70 మంది తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తల్ని హత్య లుచేశారని ఆయన ద్వజమెత్తారు,. వేల కోట్ల ఆస్తిని పేద ప్రజల కోసం దానం చేసిన వ్యక్తి అశోక్ గజపతి రాజు …అలాంటి వ్యక్తి పై అక్రమ కేసులు పెట్టి వేధించిన చెత్త ప్రభుత్వం ఇదని ఆయన మండిపడ్డారు. మా సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప కాకినాడ లో ఒక పెళ్లి కి వెళితే ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని తెలుగుదేశం పార్టీని ఎదుర్కోలేక అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆయన వైకాపాపై ఆరోపించారు, ఇంకా విచిత్రం ఏంటంటే సీఎం సొంత నియోజకవర్గం పులివెందుల లో నాగమ్మ అనే దళిత మహిళ ని చంపేస్తే కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన టిడిపి ఎస్సి నాయకులు ఎంఎస్ రాజు, అనిత పై ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించిన ఘనత వైసిపి దనిఆయన ఎద్దేవా చేశారు. వివేకా గారి కుటుంబానికి న్యాయం చెయ్యమని మాట్లాడినందుకు బిటెక్ రవి పై పెట్టిన కేసులకు లెక్కేలేదన్నారు. ప్రొద్దుటూరు టిడిపి ఇంఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి చేసిన తప్పేంటి? ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేసారు?ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడటమే ప్రవీణ్ చేసిన తప్పా? అంటూ నారా లోకేష్ తీవ్ర స్థాయిలో వైకాపా పై మండిపడ్డారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం పోరాడిన వ్యక్తి ప్రవీణ్ రెడ్డి అని అలాంటిప్రవీణ్ రెడ్డి ఇంటి పై దాడి చేసింది వైసిపి రౌడీలు, రాళ్లు వేసింది వైసిపి రౌడీలు కాదా అంటూ ఆయన ప్రశ్నించారు. పోలీసులు అరెస్ట్ చేసింది ప్రవీణ్ కుమార్ రెడ్డిని. బాధితుడ్ని అరెస్ట్ చేసారు. అందుకే ఏపీలో నడుస్తుంది రివర్స్ పోలీసింగ్ అంటున్నాననిప్రవీణ్ కుమార్ రెడ్డి, టిడిపి నాయకుల పై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే పేరు రాచమల్లు ప్రసాద్ రెడ్డి కాదు రాచమల్లు బెట్టింగ్ రెడ్డి అంటే బాగుంటుందని ఆయన రాచమల్లు పై ఘాటుగా ప్రశ్నించారు.నియోజకవర్గంలో భారీగా ఇసుక దోపిడీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు,
చెన్నూరు లో నారా లోకేష్ కు ఘన స్వాగతం పలికిన టిడిపి నాయకులు
డప జిల్లా పర్యటనలో భాగంగా కడప నుండి ప్రొద్దుటూరు కి రోడ్డు మార్గంలో వెళుతున్న తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు చెన్నూరు లో టిడిపి నాయకులు ఘనంగా స్వాగతం పలికారు, టిడిపి నాయకత్వం వర్ధిల్లాలి, నారా లోకేష్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు, అనంతరం నారా లోకేష్ టిడిపి నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అభివాదం చేస్తూ, టిడిపి నాయకుల కార్యకర్తల్లో లో జోష్ పెంచారు.

About Author