PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పాదయాత్రతో హిస్టరీ క్రియేట్ చేయనున్న నారా లోకేష్.. టి.జి భరత్

1 min read

– పాదయాత్రలో తెలుసుకున్న సమస్యలన్నీ అధికారంలోకి వచ్చాక పరిష్కరిస్తాం

– నారా లోకేష్ ను ఆశీర్వదిస్తున్న ప్రజలకు ధన్యవాదాలు.. టిడిపి నేతలు బి.టి నాయుడు, టి.జి భరత్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  రాష్ట్ర ప్రజల కోసమే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేస్తున్నారని కర్నూలు పార్లమెంటు టిడిపి అధ్యక్షులు బి.టి నాయుడు, కర్నూలు నియోజకవర్గ ఇంచార్జి టి.జి భరత్ స్పష్టం చేశారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా కర్నూల్లో టిజి భరత్ ఆధ్వర్యంలో సంఘీభావంగా జొహరాపురంలో పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రలో ఎమ్మెల్సీ బి.టి నాయుడుతో కలిసి టిజి భరత్ పాల్గొన్నారు. వేలాదిగా తరలివచ్చిన ప్రజలతో యాత్ర జొహరాపురం వీధుల్లో సాగింది. పాదయాత్ర అనంతరం టి.జి భరత్ మాట్లాడుతూ నారా లోకేష్ యువగళం పాదయాత్రతో ఒక హిస్టరీ క్రియేట్ చేయబోతున్నారన్నారు. 200 రోజుల్లోనే 2709 కిలోమీటర్లు చేరుకోవడం సామాన్య విషయం కాదన్నారు. నారా లోకేష్ పాదయాత్రలో తెలుసుకున్న సమస్యలను తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని చెప్పారు. జొహరాపురంలో నారా లోకేష్ పాదయాత్ర సమయంలో చెప్పిన విధంగా టిడిపి గెలిచిన వెంటనే పరిశ్రమలు తీసుకురావడంతో పాటు ఫార్మా హబ్ చేస్తామని మరోసారి భరత్ హామీ ఇచ్చారు. ప్రజల ఆశీర్వాదాలు తెలుగుదేశం పార్టీపై ఉండాలన్నారు. నారా లోకేష్ ఆరోగ్యంగా ఉండి విజయవంతంగా యాత్ర పూర్తి చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అనంతరం బి.టి నాయుడు మాట్లాడుతూ నారా లోకేష్ ను ఆశీర్వదిస్తున్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ పాలనలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికే నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నారన్నారు. ప్రజలందరి ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

About Author