NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నారాభువనేశ్వరిని కలిసిన గట్టుతిలక్​

1 min read

ఆళ్లగడ్డ, పల్లెవెలుగు:  నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా  టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, నారా భువనేశ్వరి కర్నూలు పర్యటనకు విచ్చేశారు. అందులో భాగంగా  ఓర్వకల్లు ఎయిర్​ పోర్టు వద్ద కర్నూల్ జిల్లా నేతలతో  కలిసి దిగిన నారా భువనేశ్వరిని మంగళవారం  ఐటీడీపీ కర్నూల్ జిల్లా అధ్యక్షులు గట్టు తిలక్ మర్యాదపూర్వకంగా కలిశారు. చంద్రబాబు గారి అరెస్టుతో దిగ్బ్రాంతి చెంది మృతి చెందిన కుటుంబాలను పరామర్శించడమేకాక.. వారికి అండగా నిలుస్తున్న పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా భువనేశ్వరి  వెంటే తాము ఉంటామని ఈ సందర్భంగా ఐటీడీపీ కర్నూల్ జిల్లా అధ్యక్షులు గట్టు తిలక్ మీడియాకు తెలిపారు.

About Author