PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘నార‌ప్ప ’ వివాదం.. సురేష్ బాబు స్పంద‌న !

1 min read

సినిమా డెస్క్​: ‘నార‌ప్ప` సినిమాను ఓటీటీలో విడుద‌ల చేయాల‌ని చిత్ర బృందం నిర్ణయించింది. ఈ సినిమాకి సురేష్ ప్రొడ‌క్షన్స్ స‌హ నిర్మాత‌. ఈనేప‌థ్యంలో నార‌ప్ప సినిమా థియేట‌ర్లలో విడుద‌ల చేయ‌కుండా.. ఓటీటీలో విడుద‌ల చేయ‌డం ప‌ట్ల ప‌లువురు ఎగ్జిబిట‌ర్లు నిర్మాత డి.సురేష్ బాబు పై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీని పై సురేష్ బాబు స్పందించారు. త‌న సొంత నిర్మాణ సంస్థలో నిర్మించిన సినిమాల విడుద‌ల నిర్ణయం త‌న చేతుల్లో ఉంటుంద‌ని, నార‌ప్ప సినిమా ఎస్. థాను తో క‌లిసి నిర్మించినందున.. ఆయ‌న నిర్ణయం మేర‌కు ఓటీటీలో విడుద‌ల చేస్తున్నట్టు సురేష్ బాబు తెలిపారు. థ‌ర్డ్ వేవ్ ను దృష్టిలో ఉంచుకుని ఎవ‌రూ న‌ష్టపోకూడ‌ద‌ని ఓటీటీలో విడుద‌ల నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. త‌మ కుటుంబ స‌భ్యుల్నే థియేట‌ర్ కి వెళ్లనివ్వడం లేద‌ని, అలాంటిది ప్రేక్షకుల్ని ఎలా థియేట‌ర్ కు ర‌మ్మంటామ‌ని అన్నారు. భ‌విష్యత్తు ఓటీటీదే అయినా.. థియేట‌ర్లు కూడ ఉంటాయ‌ని తెలిపారు.

About Author