జేఈఈ అడ్వాన్స్లో.. నారాయణ ప్రభంజనం
1 min read
కర్నూలు (ఎడ్యుకేషన్), న్యూస్ నేడు : ఎన్టిఏ వారు విడుదల చేసిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఫలితాలలో మరోసారి కర్నూలు నారాయణ ప్రభంజనం సృష్టించింది. కర్నూలు నారాయణ కళాశాల నుండి వివిధ క్యాటగిరిలో కె. జీవన్ కుమార్ 143 ర్యాంకు, పి. జశ్వంత్ నాయక్ 174 ర్యాంకు, టి. మిథున్ సాయి కుమార్ 1221 ర్యాంకు, ఎ. మణిదీప్ 1817 ర్యాంకు, యస్. సాయి మానస్ గౌడ్ 2893 ర్యాంకు, చరణ్ కుమార్ 3433 ర్యాంకు, వై. సాహితి 3364 ర్యాంకులు వచ్చాయి. 500 లోపు ఇద్దరు, 2,000 లోపు నలుగురు, 5,000 లోపు 9 మందికి ర్యాంకులు వచ్చాయి. ఇలా చాలా ర్యాంకులను కైవసం చేసుకొనడంలో నారాయణ విద్యాసంస్థలు మరోసారి విజయకేతనాన్ని చాటారు. అలాగే ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరిలో కె. జీవన్ కుమార్ 889 ర్యాంకు, టి. మిథున్ సాయి కుమార్ 6015 ర్యాంకు, సాయి శ్రుతి 6124 ర్యాంకు, కె. సాయి భాస్కర్ 9298, ఎన్ హర్షిత 12007 ర్యాంకు, యస్. సాయి మానస్ గౌడ్ 12176 ర్యాంకు, చరణ్ కుమార్ 13982 ర్యాంకు, శివ ధనుష్ 15051 ర్యాంకు, పి. జశ్వంత్ నాయక్ 19411 ర్యాంకు, వై. సాహితి 23517 ర్యాంకు, శాంత జోన్స్ 25965 ర్యాంకు, ముస్తఖిమ్ 27197 ర్యాంకు, ఆల్ ఇండియా ర్యాంకులు వచ్చాయి. ఓపెన్ కేటగిరిలో 5000 లోపు ఒక్కరు, 10,000 లోపు 4 మంది, 20,000 లోపు 9 మంది, 25,000 లోపు 10 మందికి వచ్చాయి. ఈ కార్యక్రమంలో కళాశాల డి.జి.ఎమ్. టి.గోవర్ధన్ రెడ్డి, డీన్ వేణు గోపాల్ రెడ్డి ప్రిన్స్పాల్స్ విజయ మోహన్, వెంకట రాముడు, అధ్యాపకులు మరియు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
