PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

త‌ల‌పై చెప్పు పెట్టుకుని నిర‌స‌న తెలిపిన నారాయ‌ణ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : చెప్పుల పై జీఎస్టీ భారం మోప‌డం పై సీపీఐ నారాయ‌ణ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వినూత్న‌రీతిలో నిర‌స‌న తెలిపారు. త‌ల పై చెప్పులు పెట్టుకుని నిర‌స‌న తెలిపారు. ఈ చర్యతో సామాన్యుడు కాళ్లకు చెప్పులు ధరించే పరిస్థితి లేదని, అవి అరిగిపోతే మరో జత కొనలేని పరిస్థితిలో తలమీద పెట్టుకుని నడవాల్సిందేనని అన్నారు. రూ.వెయ్యిలోపు కాటన్‌ వస్త్రాలు కొనేవారికి 12 శాతం జీఎస్టీ విధించడం ఏమిటని ప్రశ్నించారు. సామాన్యుడు ధ‌రించే చెప్పుల‌పై జీఎస్టీ భారం మోప‌డం సిగ్గుచేట‌ని విమ‌ర్శించారు.

                                

About Author