PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నరేష్​ కుమార్​ మరిన్ని పతకాలు సాధించాలి: కురువ సంఘం గౌరవాధ్యక్షుడు పుల్లన్న

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: నరేష్ కుమార్ కురువ ఆసియా క్రీడల్లో రాణించాలని జిల్లా కురువ సంఘం గౌరవాధ్యక్షులు డా. టి. పుల్లన్న, ప్రధాన కార్యదర్శి ఎం. కె. రంగస్వామి పేర్కొన్నారు. శనివారం సాయంకాలం సంఘం కార్యాలయం లో జాతీయ అథ్లెటిక్ పోటీల్లో బంగారు పతకం సాధించిన కురువ నరేష్ కుమార్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా జిల్లా గౌరవ అధ్యక్షులు డా. టి. పుల్లన్న మాట్లాడుతూ భవిష్యత్తులో ఒలంపిక్, ఆసియా క్రీడల్లో అనేక పథకాలు సాధించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బి. వెంకటేశ్వర్లు, సహాయ కార్యదర్శి వెంకటకృష్ణ జిల్లా నాయకులు బి. సి. తిరుపాల్, నాగయ్య, మద్దిలేటి, మధు, పుల్లన్న, నగేష్, బి. మధు కుమార్ తదితరులు పాల్గొన్నారు.

About Author