PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దేశ అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యం….

1 min read

– పాణ్యంనియోజకవర్గ ఇన్చార్జ్ నాగ మధు యాదవ్

– రాబోవు ఎన్నికల్లో అధికారంలో  వచ్చేది కాంగ్రెసే

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  దేశ ప్రగతి దేశ అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని, రైతులు యువత నిరుద్యోగులు విద్యార్థులు ఉద్యోగులు కాంగ్రెస్ పార్టీ హయంలోనే అభివృద్ధి చెందారని ఆదివారం నాడు గడివేములలో కోఆర్డినేటర్ రవికిరణ్ ఆధ్వర్యంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాణ్యం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ,NSUIవిద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగ మధు యాదవ్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ  భారత్ జోడోయాత్ర దేశవ్యాప్తంగా దేశ ప్రజలు ప్రధానమంత్రి కావాలని ఆశిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకుఒకే మొత్తంలో దేశవ్యాప్తంగా మూడు లక్షల రుణమాఫీ, మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీ, నిరుద్యోలకు నిరుద్యోగ భృతి, వితంతులు వృద్ధులకు వికలాంగులకు 4000 పింఛన్ దేశవ్యాప్తంగా అమలు చేస్తామని రాహుల్ గాంధీ  తెలిపారని మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ నిన్నటికి మర్చిపోదని కర్ణాటకలో అధికారంలో రావడానికి మైనార్టీలు ముఖ్యపాత్ర పోషించారని అన్నారు రాహుల్ గాంధీ జోడో భరత్ పాదయాత్ర అపురూప స్పందన లభించిందన్నారు. కాంగ్రెస్ పార్టీ విజయానికి అభివృద్ధికి ప్రతి ఒక్క కార్యకర్త కృషిచేసి, గెలుపు కోసం ఆశ పడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో  కోఆర్డినేటర్ రవి కిరణ్ మాట్లాడుతూ నంద్యాల అధ్యక్షుడు ,పాణ్యం కోఆర్డినేటర్ శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్ ఎస్ యు ఐ నాయకులు సుబ్బయ్య, నాయకులు రహమాన్ భాష మౌలాలి, తదితరనాయకులు పాల్గొన్నారు.

About Author