PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహిళలతోనే..దేశాభివృద్ధి..

1 min read

– సేవా సంక్షేమ మిత్ర మండలి  కర్నూలు అధ్యక్షుడు సండేల్ చంద్రశేఖర్

పల్లెవెలుగు వెబ్, కర్నూలు:మహిళలు అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తున్నారని, వారితోనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు బ్రాహ్మణ సేవా సంక్షేమ మిత్ర మండలి  కర్నూలు అధ్యక్షుడు సండేల్ చంద్రశేఖర్.  అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బుధవారం నగరంలోని దేవి ఫంక్షన్​ హాల్​లో బ్రాహ్మణ వీరవనితలను ఘనంగా సన్మానించారు. అంతకుముందు  ప్రముఖ వైద్యులు డా. సీతమ్మ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సండేల్​ చంద్రశేఖర్​ మాట్లాడుతూ మహిళలు..మహారాణులన్నారు. సామాజికంగా.. రాజకీయంగా.. ఉద్యోగం పరంగా రాణిస్తున్న బ్రాహ్మణ వీరవనితలను బ్రాహ్మణ సేవా సంక్షేమ మిత్ర మండలి నేతృత్వంలో సన్మానించడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా వైద్యరాలు డా. సీతమ్మ,  శ్రీలక్ష్మి, విజయలక్ష్మి ,అరుణ, దేవకీదేవి, కళ్ళేసీతలక్ష్మీ, ఆదిలక్ష్మి,పద్మావతిని శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.  కార్యక్రమానికి హాజరైన ప్రతి మహిళకు పసుపు, కుంకుమ, రవిక, గాజులు, పూలు, పండ్లు ఇచ్చారు. అనంతరం భోజనం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో బ్రాహ్మణ సేవ సంక్షేమ మిత్రమండలి సభ్యులు K శ్యామ్ సుందర్ రావు, నాగవరం రాజశేఖర్, A రాధ కృష్ణ, శ్రీను, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

About Author