PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వీఆర్డీఎస్ ఆధ్వర్యంలో జాతీయ రైతు దినోత్సవం

1 min read

పల్లెవెలుగువెబ్​, అన్నమయ్య  జిల్లా రాయచోటి /వీరబల్లి: వీరబల్లి మండల కేంద్రంలోని విఆర్డీఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం జాతీయ రైతు దినోత్సవం పురస్కరించుకుని వీరబల్లి పంచాయతీలోని  వెంకట్రామరాజు అనే రైతును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా విఆర్డీఎస్ సంస్థ అధ్యక్షుడు సురేంద్రారెడ్డి మాట్లాడుతూ భారత దేశ ఆర్థిక వ్యవస్థకు రైతే వెన్నుముక వ్యవసాయ అనే జీవన విధానంతో అన్నదాతలు అహర్నిశలు కష్టపడి దేశానికీ అన్నం పెడతాడు రైతన్న ఆరుగాలం శ్రమించి ఎన్నొకష్టాలకు ఓర్చి పంట పండిస్తారు. దేశాన్ని రక్షించే సైనికులకు ఎంత ప్రాముఖ్యత ఉందో అన్నం పెట్టే రైతన్నలుకు అంత కంటే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకుడు నాగుర్ రెడ్డి, టీడీపీ బీసీ నాయకుడు తుమ్మల రమేష్, సిరికల్చర్ అధికారులు నాగసుబ్బరాయుడు,గంగిరెడ్డి పాల్గొన్నారు.

About Author