PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘జాతీయ’ హ్యాండ్​ బాల్​ పోటీకి ఎంపికైన విద్యార్థికి అభినందన

1 min read

పల్లెవెలుగు వెబ్: కర్నూలు శివారు జి పుల్లారెడ్డి నగర్ లోని విజ్ఞాన పీఠం ఉన్నత పాఠశాలలో ఈరోజు చిరంజీవి మల్లికార్జున ను విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ నంది రెడ్డి సాయి రెడ్డి అభినందించారు. చిరంజీవి మల్లికార్జున జాతీయస్థాయిలో ఆడడానికి హ్యాండ్ బాల్ టీం లో ఎంపిక కావడం గర్వించదగిన విషయము తో పాటు ఆనందించవలసిన విషయంగా తెలిపారు. ఈ అభినందన కార్యక్రమంలో ముఖ్యవక్తగా డా.రామకృష్ణయ్య గారు మాట్లాడుతూ విజ్ఞానపీఠం ఉన్నత పాఠశాల త్రోబాల్లో ప్రతి సంవత్సరం రికార్డులు సాధిస్తుందని గతంలో జాతీయస్థాయిలో బాలిక ఎంపికైందని ఈ కృషికి కారణమైన పాఠశాల పీఈటి మాస్టారు శ్రీ రామిరెడ్డి అభినందనీయుడని తెలిపారు. సభాధ్యక్షులు  విజ్ఞాన పీఠం కార్యదర్శి శ్రీ గురుమూర్తిగారు మాట్లాడుతూ ఇటీవల కమలాపురంలో జరిగిన రాష్ట్రస్థాయి త్రోబాల్ ఎంపికలో మన పాఠశాలకు గుర్తింపు రావడం అభినందనీయమని, ఇంకా జాతీయ స్థాయిలో గెలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన పీఠం కోశాధికారి మాణిక్య రెడ్డి, ప్రధానోపాధ్యాయులు వ్యాసరాజ్ , రామిరెడ్డి, చంద్రమోహన్ , నాగేశ్వర రెడ్డి తదితరులు  ప్రసంగించారు.

              

About Author