NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాజకీయ కక్షపూరిత ధరణితోనే గాంధీ కుటుంబంపై నేషనల్ హెరాల్డ్ కేసులు..

1 min read

ఎన్ ఎస్ యు వై.

రాహుల్ గాంధీ అనే పేరు భారతీయ జనతా పార్టీ నేతల వెన్నులో వణుకు పుట్టిస్తుంది.

ఎమ్మిగనూరు, న్యూస్​ నేడు: ఎమ్మిగనూరు గాంధీ వారసులపై గాడ్సే వారసులు చేస్తున్న రాజకీయ రాక్షసకుట్రలకు కాంగ్రెస్ పార్టీ భయపడదు.రాక్షసానందం కోసం అధికార దుహంకారంతో ప్రవర్తిస్తున్న రాష్ట్ర బిజెపి నేతలకు భవిష్యత్తులో తగిన గుణపాఠం చెబుతాం. ఎన్.ఎస్.యు.ఐ. జిల్లా అధ్యక్షుడు వీరేష్ యాదవ్అధికార దుర్వినియోగం గురించి బిజెపి నేతల వ్యాఖ్యలు వింటుంటే దెయ్యాలు వేదాలు వర్ణించినట్టు ఉంది.అదాని ప్రపంచ కుబేరుల్లో టాప్ 30వ స్థానంలోకి రావడం కోసం మోడీ చేసిన అధికార దుర్వినియోగం అంతులేనిది.అవినీతి అక్రమార్కులకు, స్కాంమర్లకు, బ్యాంకు దొంగలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీ గురించి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గురించి మాట్లాడే నైతిక విలువలు అర్హత లేదు.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై భారత రాజ్యాంగంపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నందుకే రాహుల్ గాంధీ పై బిజెపి ఆర్ఎస్ఎస్ లు అనేక రకాల దుర్మార్గపు కుట్రలుపన్నుతున్నాయి..రాహుల్ గాంధీ పౌరసత్వం పై, వ్యక్తిగత జీవితం పై, వారసత్వం పై, రాజకీయం పై బిజెపి చేస్తున్న దుర్మార్గపు ఆరోపణలు నిరాధారమైనవి.బ్రిటిష్ పాలకుల తొత్తుగా వ్యవహరించి నాడు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనని ఆరెస్సెస్ సావర్కర్ వారసులు నేడు స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు, ఆస్తులు గురించి నేడు మాట్లాడటం విడ్డూరంగా వింతగా ఉంది.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *