PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆత్మకూరులో ఘనంగా జాతీయ పత్రికా దినోత్సవం

1 min read

పల్లెవెలుగు వెబ్​:జాతీయ పత్రికా దినోత్సవంను   ఆత్మకూరులో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా  ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. తొలుత కేక్ కట్ చేసి పత్రికా దినోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా సీనియర్ పాత్రికేయులు  మాట్లాడుతూ జాతీయ పత్రికా దినోత్సవం ఆవశ్యకతను వివరించారు. పత్రికా స్వేచ్ఛను కాపాడటంతో తోపాటు అందులో పని చేస్తున్న పాత్రికేయుల జీవితాలకు భరోసా, భధ్రత కల్పంచేలా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు. సీనియర్ పాత్రికేయులు జోసఫ్ శేఖర్, శీలం శేషు  అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు బీసు, ఈశ్వర్, శ్రీనివాసులు, చంద్ర, శివ, సురేష్, కృష్ణ, తో పాటు పట్టణ మండల విలేకరులు పాల్గొన్నారు.

About Author