PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జాతీయ సమైక్య దినోత్సవం..

1 min read

పల్లెవెలుగు, వెబ్​ గడివేముల: శనివారం నాడు ఉక్కుమనిషిగా పేరుపొందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల నందు ఇన్చార్జ్ హెచ్ఎం దస్తగిరమ్మ ఉపాధ్యాయినీ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో జాతీయ సమైక్య దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు వకృత్వ పోటీలు డ్రాయింగ్ కాంపిటీషన్ నిర్వహించారు వ్యాసరచన పోటీల్లో మొదటి బహుమతి జి శ్రావణి. రెండో బహుమతి దైవ హర్షిత . మూడవ బహుమతి రుక్సాన గెలుపొందారు వకృత్వ పోటీల్లో మొదటి బహుమతి సాదియా గెలుపొందారు. డ్రాయింగ్ పోటీల్లో మొదటి బహుమతి సలీమా. రెండో బహుమతి జెస్సికా. మూడో బహుమతి అన్షు గెలుపొందారు.

About Author