PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జాతీయ ఓటర్ల దినోత్సవం… అవగాహన ర్యాలీ

1 min read

పల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల: మండల కేంద్రమైన గోనెగండ్ల లో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మండల తాసిల్దార్ వేణుగోపాల్ ,మండల అభివృద్ధి అధికారి ప్రవీణ్ కుమార్ ,మండల విద్యాధికారి వినోద్ కుమార్, మండల సబ్ ఇన్స్పెక్టర్ తిమ్మారెడ్డి లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో కలిసి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి బస్టాండ్ ఆవరణ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం బస్టాండ్ ఆవరణలో మానవహారం ఏర్పాటు చేసిన సందర్భంగా వారు మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని అన్నారు.అలాగే రాజ్యాంగ బద్ధంగా వచ్చినటువంటి ఓటును అమ్ముకోమని నిజమైన ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి మా ఓటు హక్కును వినియోగిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఈఓఆర్డి నాగేష్ జడ్.పి.హెచ్.ఎస్ ప్రధానోపాధ్యాయులు నాగభూషణం ఉపాధ్యాయులు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author