PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దేశవ్యాప్తంగా.. నేడు, రేపు బ్యాంకు ఉద్యోగుల స‌మ్మె

1 min read
                                     



                ప‌ల్లెవెలుగువెబ్ :
                 దేశ‌వ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు రెండ్రోజుల పాటు స‌మ్మెకు దిగారు. 9 ల‌క్ష‌ల మంది బ్యాంకు ఉద్యోగులు గురువారం, శుక్ర‌వారం స‌మ్మెలో పాల్గొన‌నున్నారు. రెండు ప్ర‌భుత్వ బ్యాంకుల‌ను ప్రైవేటీక‌రించాల‌న్న కేంద్రం ప్ర‌తిపాద‌న‌కు నిర‌స‌న‌గా స‌మ్మెకు దిగ‌నున్న‌ట్టు ఉద్యోగ సంఘాలు తెలిపాయి.  స‌మ్మె నేప‌థ్యంలో చెక్కుల క్లియరెన్సులు, నగదు బదిలీ వంటి లావాదేవీలపై ప్రభావం పడవచ్చంటూ పలు బ్యాంకులు తమ ఖాతాదారులను ముందే అప్రమత్తం చేశాయి. అడిషనల్‌ చీఫ్‌ లేబర్‌ కమిషనర్‌తో బుధవారం జరిగిన చర్చలు విఫలమయాయ్యని అఖిల భారత బ్యాంకు అధికారుల సమాఖ్య  ప్రధాన కార్యదర్శి సౌమ్యా దత్తా తెలిపారు.

                          

About Author