PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నాటుసారా తరలిస్తూ.. ఇద్దరి అరెస్టు

1 min read

పల్లెవెలుగు వెబ్​, గడివేముల: కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని కాల్వ బుగ్గ నుంచి కొమ్ము చెరువు పోయేదారిలో  ఆదివారం నాటుసారా తరలిస్తుండగా … అరెస్టు చేసినట్లు ఎస్​ఐ మల్లికార్జున తెలిపారు.  కర్నూలు డీఎస్పీ మహేష్​ ఆదేశాల మేరకు… కర్నూలు రూరల్​ సీఐ శ్రీనాథ్​ రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి నాటుసారా తరలిస్తున్న వారిని పట్టుకున్నట్లు ఎస్​ఐ మల్లికార్జున వివరించారు.  బేతంచెర్ల మండలం శంకరాపురం గ్రామానికి చెందిన ఇత్తడి కృష్ణుడు, మిలిటరీ మద్దిలేటి అనే వ్యక్తులు ( బైక్​ నెం. ఏపీ AP21 BX  2898 ) సారా తరలిస్తుండగా… కొమ్ము చెరువు వెళ్లేదారిలో పట్టుకుని వారి వద్ద ఉన్న 20 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు.  బైక్​ను సీజ్​ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్​ఐ మల్లికార్జున హెచ్చరించారు. ఓర్వకల్  పోలీసులు మద్దిలేటి,  రంగన్న,  రాఘవేంద్ర మరియు  గోవింద నాయక్  ఉన్నారు.

About Author