NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నీట్ పరీక్ష వాయిదా

1 min read

పల్లెవెలుగువెబ్ : నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్-పోస్ట్ గ్రాడ్యుయేషన్ పరీక్షను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు వాయిదా వేసింది. నీట్ పీజీ పరీక్ష తేదీ 2022 మార్చి 12 అని, అదే సమయంలో నీట్ పీజీ-2021 కౌన్సెలింగ్ జరగబోతోందని, అందువల్ల నీట్ ​​ పీజీ పరీక్షను వాయిదా వేయాలని మెడకికల్ డాక్టర్ల నుంచి అనేక వినతులు వస్తున్నట్లు ఆరోగ్య సేవల విభాగం డైరెక్టర్ శుక్రవారం జారీ చేసిన ఆదేశాల్లో తెలిపారు. 2022 మే లేదా జూన్ నెలలో జరిగే పీజీ కౌన్సెలింగ్ 2022లో చాలా మంది ఇంటర్న్స్ పాల్గొనే అవకాశం ఉండదని చెప్తున్నారని పేర్కొన్నారు.

            

About Author